Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొన్ని పార్టీలు లేదా వ్యక్తులు ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తున్నారన్న నెపంతో, పలువురు కీలక రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు వెల్లడవుతోంది. తాజాగా ఈ కేసులో 4200 మందికి పైగా వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై ఆరోపణలు వచ్చాయి.
G7 Summit: జీ 7 సమ్మిట్లో మెలోని-మాక్రాన్ గుసగుసలు.. వీడియో వైరల్
2023 నవంబర్ 15 నుండి 30వ తేదీ మధ్యలోనే కనీసం 618 మంది నేతల ఫోన్లను ట్యాప్ చేశారట. ఇందులో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన వైసీపీ నాయకులు కూడా ఉన్నారు. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి, కోటింరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి వంటి నాయకుల ఫోన్లను కూడా ప్రభాకర్ రావు నేతృత్వంలోని బృందం ట్యాప్ చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్తో పాటు కాంగ్రెస్, బీజేపీ సహా అనేక పార్టీల కీలక నేతలు, అనుచరుల ఫోన్లు కూడా ట్యాపింగ్ లక్ష్యంగా మారాయి.
ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేగంగా దర్యాప్తు కొనసాగిస్తోంది. నిన్న ఒక్కరోజే తొమ్మిది మంది సాక్షుల స్టేట్మెంట్లు రికార్డు చేశారు. అందులో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, గద్వాల మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత, ఆమె భర్త తిరుపతయ్య, గాంధీ భవన్కు చెందిన నలుగురు ఉద్యోగులు ఉన్నారు. ఇవన్నీ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చిన ఆధారాలతో వెలుగులోకి వచ్చాయి. ఈ రోజు పీసీసీ అధికార ప్రతినిధి జయపాల్ రెడ్డి సిట్ ముందు హాజరై స్టేట్మెంట్ ఇచ్చారు. అదే విధంగా ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును కూడా విచారించారు.
Bayya Sunny Yadav: నేను వచ్చేశా.. సింహాచలంలో ప్రత్యక్షమైన యూట్యూబర్ సన్నీ భయ్యా!