Karishma Kapoor : బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరిష్మా కపూర్ ఎమోషనల్ అయ్యారు. తన మాజీ భర్త సంజయ్ కపూర్ వారం రోజుల క్రితం లండన్ లో చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఆయన అంత్యక్రియలు ఢిల్లీలోని దయానంద్ ముక్తిథామ్ లో నిర్వహించారు. ఇందులో కొడుకుతో పాటు పాల్గొన్న కరిష్మా.. తన మాజీ భర్త శవాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. ఆమెను తన కొడుకు ఓదార్చారు. ఇందుకు సంబంధించిన ఫటోలు ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి. ఆమెతో పాటు సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ కూడా అంత్యక్రియలకు హాజరయ్యారు.
Read Also : Janhvi Kapoor : బాయ్ ఫ్రెండ్ తో లండన్ లో జాన్వీకపూర్ ఎంజాయ్..
సంజయ్ కపూర్ లండన్ లో గోల్ఫ్ ఆడుతూ సడెన్ గా తేనెటీగను మింగాడు. అది గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక ఇబ్బంది పడ్డాడు. అదే టైమ్ లో ఆయనకు హార్ట్ ఎటాక్ రావడంతో కన్నుమూశాడు. వారం రోజుల తర్వాత ఆయన పార్థివదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చి ఈ రోజు అంత్యక్రియలు నిర్వించారు. కరీనా కపూర్, సంజయ్ కపూర్ కు 2003లో పెళ్లి కాగా వీరిద్దరూ 2014లో విడిపోయారు.
Read Also : Keerthy Suresh : విజయ్ దేవరకొండతో కీర్తి సురేష్.. హింట్ ఇచ్చిందిగా..