టీజీ ఎడ్సెట్-2025 (తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ ఉన్న విద్యా మండలి పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. 30,944 మంది క్వాలిఫై అయ్యారు. 96.38 శాతం అర్హత పొందారు. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో హాల్టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ఫలితాలు పొందవచ్చు. ఈ పరీక్షకు మొత్తం 38,758 మంది దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 1న రెండు సెషన్లలో కలిపి ఎడ్సెట్కు 32,106 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా.. ఇప్పటికే ప్రీప్రైమరీ ‘కీ’ని విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించారు.
READ MORE: MP Mithun Reddy: జగన్కు వస్తున్న జనాదరణ చూసి జీర్ణించుకోలేక పోతున్నారు.. అందుకే..!