కోలీవుడ్లో ఫీల్ గుడ్ చిత్రాలతో పాపులరైన దర్శకుడు ప్రేమ్ కుమార్. తీసినవీ రెండే చిత్రాలైనా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. 96తో డైరెక్టరుగా మారిన ప్రేమ్ కుమార్ మొదట సినిమాటోగ్రాఫర్ చాలా సినిమాలకు వర్క్ చేసాడు. దర్శకుడిగా 96తో ఫస్ట్ మూవీతోనే భారీ హిట్ అందుకుని టాక్ ఆఫ్ ది కోలీవుడ్ అయ్యాడు. సున్నితమైన ప్రేమ కథను అద్భుతంగా తెరకెక్కించినందుకు గాను పలు అవార్డ్స్ కూడా అందుకున్నాడు. ఇక లాస్ట్ ఇయర్ కార్తీ, అరవింద్ స్వామి కాంబోలో వచ్చిన సత్యం సుందరం క్లాసిక్ హిట్ గా నిలిచింది.
Also Read : Mega 157 : అనిల్ రావిపూడి సినిమాలో డ్రిల్ మాస్టర్ గా మెగాస్టార్
ఈ రెండు సినిమాలతో చిన్న స్టోరీ హడావుడి, గజిబిజీ లేకుండా సినిమాను లవ్లీగా ప్రజెంట్ చేస్తుంటాడు అనే పేరు సంపాదించాడు ప్రేమ్. అందుకే ఆయనకు కోలీవుడ్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నెక్ట్స్ 96 సీక్వెల్ తెరకెక్కించనున్నాడు ప్రేమ్ కుమార్ . దీని కోసం స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారు. కానీ ఫీల్ గుడ్ చిత్రాలు కమర్షియల్ ఎలిమెంట్స్కు దూరంగా ఉంటాయని భావించాడేమో ఈ దర్శకుడు కూడా థ్రిల్లర్ అంటూ సరికొత్త జోనర్లోకి ఎంటర్ కాబోతున్నాడు. 96 సీక్వెల్ తర్వాత ఓ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నట్లు రీసెంట్లీ ఓ సందర్భంగా రివీల్ చేశాడు. దీని కోసం కథను సిద్ధం చేసుకుంటున్నాడట. అయితే కోలీవుడ్లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం ప్రదీప్ రంగనాథ్తో మూవీ ఉండబోతుందని టాక్. అదే నిజమైతే ఓ మంచి క్లాసిక్ దర్శకుడి నుండి సరికొత్త థ్రిల్లర్ రాబోతున్నట్టే. కానీ ప్రేమ్ కుమార్ అంటేనే మనుసుని తాకే కథలు మరి అలాంటి దర్శకుడు ఎలాంటి థ్రిల్లర్ తో వస్తాడో చూడాలి.