ఓవైపు ఆడియెన్స్ థియేటర్స్ కు రావడం లేదని సినిమా ఫంక్షన్స్ లో మీడియా ముందు గంటలు గంటలు ప్రసంగాలు ఇస్తారు నిర్మాతలు. తీరా తమ సినిమా రిలీజ్ అవుతుంటే మాత్రం సైలెంట్ గా వెళ్లి ప్రభుత్వాల దగ్గర అనుమతులు తెచ్చుకుంటారు సదరు నిర్మాతలు. ఇక లేటెస్ట్ గా ధనుష్ నటించిన కుబేర సినిమాకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం టికెట్స్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. మల్టిప్లెక్స్ మరియు సింగిల్ స్క్రీన్స్ లో 75 రూపాయలు వరకు పెంపునకు అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. 10 రోజులపాటు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హయ్యర్ క్లాస్ టికెట్స్ కు మాత్రమే టికెట్ రేట్స్ పెంపు వరిస్తుందని పేర్కొంది.
Also Read : 8Vasantalu : కేరళ కుట్టీ తెలుగులో మెస్మరైజ్ చేస్తుందా.?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ చేస్తున్న స్ట్రయిట్ తెలుగు సినిమా కుబేర. టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఏషియన్ సినిమాస్ సునీల్, రామ్ మోహన్ రావ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కుబేర ట్రైలర్ మంచి రెస్పాన్స్ రాబట్టడమే కాకుండా సినిమాపై అంచనాలు పెంచింది అనే చెప్పాలి. శుక్రవారం రిలీజ్ అవుతున్న కుబేర సినిమాకు ఏపీ లో టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలుగు ఫిల్మ్ చాంబర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ హోంశాఖకు దరఖాస్తు చేసుకున్నారు కుబేర నిర్మాతలు. అందుకు సానుకూలంగా స్పందించి అనుమతులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.